లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏడుగురు కాంగ్రెస్ ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. సభ సజావుగా జరగకుండా ఆటంకం కలిగిస్తున్న ఈ ఏడుగురిపై ప్యానల్ స్పీకర్ మీనాక్షి లేఖి చర్యలు తీసుకున్నారు. ఈ ఏడుగురు ఎంపీలను లోక్సభ సమావేశాల మిగిలిన రోజులకు స్పీకర్ సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన ఎంపీల్లో గౌరవ్ గోగోయ్, టీఎన్ ప్రతాపన్, డీన్ కురియాక్స్, మాణిక్ ఠాకూర్, బెన్నీ బెహ్నన్, గర్జిత్ అహ్లువాలియా, ఆర్. ఉన్నితన్ ఉన్నారు.