గ్రేట్ బామ్మ : నిమిషంలోనే ఆరు ఇడ్లీలను తినేసింది...

Update: 2019-10-01 11:11 GMT

అల్పాహారంలో ఇడ్లీకి మించింది మరొకటి లేదు. ఇడ్లీ తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెబుతూ ఉంటారు. తొందరగా జీర్ణం అవుతుంది కూడా.. కానీ ఇడ్లీ తినడానికి మనం మాత్రం ఎక్కువగా ఆసక్తిని చూపించం. ఒకవేళ చూపించిన నాలుగు ఇడ్లీలకంటే ఎక్కువగా తినలేము. కానీ ఓ అరవై ఏళ్ల బామ్మా మాత్రం నిమిషంలో ఏకంగా ఆరు ఇడ్లీలను తినేసింది. ఈ సంఘటన మైసూర్ లో చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే దసరా ఉత్సవాల్లో భాగంగా మంగళవారం మైసూర్ లో ఓ ఆలయం వద్ద మహిళలకు ఇడ్లీ పోటీలను నిర్వహించారు. అందులో సరోజమ్మ అనే మహిళ నిమిషంలో ఆరు ఇడ్లీలను తిని పోటిలో విజేతగా నిలిచింది. దసరా ఉత్సవాలను ఇక్కడ ఘనంగా నిర్వహిస్తున్నారు.  

Tags:    

Similar News