కరోనా వైరస్ మహ్మమారి ఏ ఒక్కరినీ వదలడంలేదు. చిన్న పిల్లల నుంచి వందేళ్ల వృద్ధులనూ మృత్యు ఒడిలోకి చేర్చుకుంటోంది. తాజాగా కేరళలో కొజికోడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో కొవిడ్-19 బారిన పడి నాలుగు నెలల శిశువు మృతి చెందిందని అక్కడి వైద్యులు తెలిపారు. కోజికోడ్కి చెందిన ఈ పసికందుకు హృదయ సంబంధ సమస్య ఉండటంతో ఈ నెల 21న స్థానిక మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేర్పించారు. న్యుమోనియా లక్షణాలు ఉండడంతో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడంతో పాజిటివ్గా నిర్ధారణ అయింది. తాజాగా చిన్నారి ఆరోగ్యం క్షీణించి ఈ ఉదయం మరణించినట్లు మళప్పురం జిల్లా వైద్యాధికారులు ప్రకటించారు. ఈ విషయాన్ని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కేకే శైలజ ధ్రువీకరించారు.