Coronavirus: న్యూస్ ఛానెల్‌లో 27 మందికి క‌రోనా పాజిటివ్‌

Update: 2020-04-21 08:55 GMT

కరోనా వైరస్‌ ఎవర్నీ వదలడం లేదు. అందరిని వెంటాడుతూ.. చంపేస్తుంది. తాజాగా తమిళనాడులోని ఓ ప్రముఖ న్యూస్‌ ఛాన‌ల్‌లో ప‌నిచేస్తున్న 27 మందికి క‌రోనా పాజిటివ్ అని తేలింది. 24 ఏళ్ల జర్నలిస్ట్‌కి కరోనా పరీక్షల్లో తొలుత పాజిటివ్‌ రావడంతో.. ఆ ఛాన‌ల్ సిబ్బందికి ప‌రీక్షలు చేప‌ట్టారు. దీంతో జ‌ర్న‌లిస్టుల‌తో స‌హా కొంత మంది సిబ్బందికి వైర‌స్ ఉన్న‌ట్లు గుర్తించామ‌ని ప్ర‌భుత్వ అధికారి ఒక‌రు తెలిపారు. దీంతో వెంట‌నే వారిని క్వారంటైన్‌కు త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. ముంబైలో కూడా సుమారు 53 మంది జ‌ర్న‌లిస్టుల‌కు వైర‌స్ సోకిన‌ట్లు తేలిసిందే. 

Tags:    

Similar News