ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో చిదంబరానికి బెయిల్

Update: 2019-10-22 07:58 GMT

ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి బెయిల్ లభించింది. ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో ఆయనపై సీబీఐ నమోదు చేసిన కేసులో మాత్రమే ఆయనకు బెయిల్ మంజూరైంది. మనీ లాండరింగ్ కేసులో ఆయనను ఈడీ విచారిస్తోంది. అయితే ఈ నెల 16న చిదంబరంను ఈడీ అరెస్ట్ చేయడంతో మరి కొంత కాలం జైల్లోనే గడపనున్నారు. ఈనెల 24 వరకు ఈడీ అధికారులు చిదంబరంను విచారించనున్నారు. ఈడీ కేసులో బెయిల్ లభిస్తేనే చిదంబరం తీహార్ జైలు నుంచి విడుదలయ్యే సూచనలు ఉన్నాయి. 

Tags:    

Similar News