Vijay Devarakonda: నిర్మాతగా మరో ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్!

Vijay Devarakonda: ఓ పక్క పలు సినిమాలతో బిజీగా మారిన విజయ్ దేవరకొండ, మరోవైపు సినిమాలు నిర్మిస్తూ దూకుడు పెంచుతున్నాడు.

Update: 2021-05-31 15:15 GMT

విజయ్ దేవరకొండ (ఫొటో ట్విట్టర్)

Vijay Devarakonda: ఓ పక్క పలు సినిమాలతో బిజీగా మారిన విజయ్ దేవరకొండ, మరోవైపు సినిమాలు నిర్మిస్తూ తన దూకుడు పెంచుతున్నాడు. అయితే, ఇండస్ట్రీలో హీరోలు నిర్మాతలుగా మారేందుకు చాలా సమయం తీసుకుంటారు. కారణం, సినిమాను నిర్మించడం ఒక ఎత్తైతే.. దానిని బిజినెస్ చేయడం మరో ఎత్తు. ఈ విషయంలో విజయ్ దేవరకొండ తనదైన దూకుడు ప్రదర్శిస్తూ.. సొంత బ్యానర్ కింగ్ ఆఫ్ ది హిల్ ఎంటర్టైన్మెంట్ ను ఏర్పాటు చేసి, మొదటి సినిమాను తెరకెక్కించేందుకు ఎక్కువ సమయం తీసుకోలేదు ఈ లైగర్ హీరో.

విజయ్.. తన బ్యానర్ పై తొలి సినిమాగా 'మీకు మాత్రమే చెప్తా' నిర్మించి ఆకట్టుకున్నాడు. విజయ్ దేవరకొండ, ప్రస్తుతం తన తమ్ముడు హీరోగా 'పుష్పక విమానం' మూవీని తెరకెక్కించే పనిలో ఉన్నాడు. ఈ సినిమాతో దర్శకుడిగా దామోదర తెలుగు తెరకు పరిచయమవుతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు దశలో ఉంది. ఇదిలా ఉంటే.. మరో సినిమాను నిర్మించేందుకు విజయ్ దేవరకొండ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పృథ్వీసేన డైరెక్టర్‌గా పరిచయం కానున్న ఈ సినిమాలో అంతా నూతన నటీనటులే కనిపించనున్నారంట. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనున్నట్లు టాక్ వినిపిస్తోంది.

Tags:    

Similar News