ప్రముఖ సీరియల్ నటి ఆత్మహత్యయత్నం

ప్రముఖ సిరియల్ నటి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. నిద్రమాత్రలు మింగి బలవన్మరణానికి యత్నించారు

Update: 2020-01-17 05:08 GMT
Actrees jyashree

ప్రముఖ సిరియల్ నటి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. తిరువాణ్మయూర్‌కు చెందిన బుల్లితెర నటి జయశ్రీ బుధవారం నిద్రమాత్రలు మింగి బలవన్మరణానికి యత్నించారు. నటి జయశ్రీ ఆమె భర్త నటుడు ఈశ్వర్ మధ్య వివాదాల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడారని తెలుస్తోంది. గత సంవత్సరం నుంచి వీరి మధ్య మన్పర్థలు వచ్చాయి. జయశ్రీ భర్త ఈశ్వర్‌కు వేరే అమ్మాయితో వివాహేతర సంబంధం ఉందని, రోజూ తనను వేధిస్తున్నారని, చర్యలు తీసుకోవాలని ఆడయార్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఈ కేసు విచారణ దశలో ఉంది.

ఈ క్రమంలో నటి జయశ్రీ చైన్నై వండలూర్‌ ప్రాంతంలోని గుడిసెలు దగ్ధమైన బాధితులను పరామర్శించడానికి వెళ్లారు. తిరువాణ్మయూర్‌ కారులో తిరిగి ప్రయాణం చేస్తుండగా ఆమె భర్త ఈశ్వర్ నుంచి ఫోన్ వచ్చింది. భర్తతో ఫోన్లో మాట్లాడిన ఆ తర్వాతే నిద్రమాత్రలు కొనుగోలు చేసి ఆత్మహత్యకు పాల్పడిందని తెలుస్తోంది. జయశ్రీ కారు నీలాంగరై సముద్రతీరంలోకి రాగానే మత్తులో ఆమె పక్కకు పడిపోయింది. దీంతో ఆమె తోపాటు వచ్చిన వ్యక్తి గమనించి స్థానిక ఆస్పత్రిలో చేర్పించాడు. వైద్యులు ఆమెను పరీక్షించి ఆరోగ్యం విషమంగా ఉందని వెల్లడించారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రి వద్దకు చెరుకొని కేసు నమోదు చేసుకున్నారు. దీనిపై మరింత దర్యాప్తు చేస్తున్నారు.

 జయశ్రీ రాసిన సూసైడ్ నోట్ బయటపడింది. భర్త రోజు తాగొచ్చి తనను వేధిస్తున్నాడని సూసైడ్ లెటర్ లో పేర్కొంది. తన కూతురు డాన్స్ నేర్చుకోనియకుండా అడ్డుకుంటున్నారని తెలిపింది. ఈశ్వర్ తన చెల్లి, తల్లికి మనవి అంటూ.. తన భార్త నుంచి కూతురిని రక్షించాలని, డాన్స్ నేర్చుకోనేలా చూడాలి, కూతురు బాద్యతలు చూసుకోవాలని జయశ్రీ లెటర్ లో పేర్కొంది.  


Tags:    

Similar News