IT Raids: ఐటీ దాడులపై స్పందించిన తాప్పీ

IT Raids: బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌, నటి తాప్సీతోపాటు పలువురు నివాసాల్లో ఐటీ దాడులపై స్పందించిన తాప్సీ

Update: 2021-03-06 09:31 GMT

ఫైల్ ఇమేజ్


IT Raids: బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌, నటి తాప్సీతోపాటు పలువురు నివాసాల్లో గత మూడు రోజులుగా జరుగుతున్నఐటీ దాడుల, నాటకీయ పరిణామాలపై హీరోయిన్ తాప్పీ ఎట్టకేలకు ట్విటర్‌ వేదికగా స్పందించారు. గడిచిన మూడు రోజుల నుంచి తన నివాసంలో ఏం జరిగిందో చెప్పారు. పారిస్‌లో తనకు ఒక బంగ్లా ఉందంటూ దాని తాళాల కోసం వెతికారని, కానీ తనకు అక్కడ ఇల్లు లేదని తాప్సీ చెప్పారు. రూ. ఐదు కోట్లు తీసుకున్నానని ఆరోపిస్తూ దాని రశీదులు కోసం వెతికారని, కానీ తానెప్పుడూ ఆ మొత్తాన్ని తీసుకోలేదన్నారు. ఆర్థిక మంత్రి చెప్పినట్లు 2013లో తన నివాసంలో ఐటీ సోదాలు జరిగిన విషయం తనకు గుర్తులేదంటూ తాప్సీ ట్విటర్‌లో పేర్కొన్నారు.

బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌, నటి తాప్సీతోపాటు పలువురు నివాసాల్లో ఇటీవల ఐటీ సోదాలు జరిగిన విషయం తెలిసిందే. ఈ తనిఖీలపై స్పందించిన కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌.. 'నేను ఎవరిపై కామెంట్‌ చేయాలనుకోవడం లేదు. 2013లో కూడా వాళ్లపై ఐటీ దాడులు జరిగాయి. ఆ సమయంలో పట్టించుకోని ఈ సమస్యను ఇప్పుడెందుకు ఇంత పెద్ద విషయంగా చూస్తున్నారు' అని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

వ్యవసాయ చట్టాల్లో కేంద్రం తీసుకు వచ్చిన చట్టాలను వెనక్కు తీసుకోవాలని గత 100 రోజులుగా రైతులు ఢిల్లీలో ఆందోళనకు మద్దతు తెలిపినందుకే ఈ దాడులు చేస్తున్నారని పలువురు మేధావులు పెదవి విరుస్తున్నారు. 

Tags:    

Similar News