'గాడ్సే'గా రాబోతున్న సత్యదేవ్‌

సత్యదేవ్ 'జ్యోతి లక్ష్మీ' సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయం అయ్యడు.

Update: 2021-01-03 09:58 GMT

సత్యదేవ్ 'జ్యోతి లక్ష్మీ' సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయం అయ్యడు. ఆయన వైవిద్య భరిత చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైయ్యాడు. మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌' సినిమాతో టాలీవుడ్‌లోకి ప్రవేశించిన సత్యదేవ్‌. ఆ తర్వాత క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, హీరోగా వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ దూసుకుపోతున్నాడు.

' బ్రోచెవారెవరురా‌', 'బ్లఫ్‌ మాస్టర్‌', 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' వంటి హిట్ చిత్రాలతో టాలీవుడ్ లో తనకంటూ ఓ ఇమేజ్ సంపాదించాడు. తాజాగా సత్యదేవ్‌ నటించబోయే కొత్త సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ వచ్చింది. గోపీ గణేష్‌ దర్శకుడకిగా.. మరోసారి సత్యదేవ్‌తో సరికొత్తగా జతకడుతున్నారు. ఈ తాజా సినిమాకు 'గాడ్సే' అని టైటిల్‌ ఫిక్స్‌ చేశారు. సి. కళ్యాణ్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. 



Tags:    

Similar News