మరిన్ని కామెడీ సీన్లతో థియేటర్లలో సందడి చేస్తున్న'సరిలేరు నీకెవ్వరు'
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. సంక్రాంతి పండగ కానుకగా జనవరి 11 న రిలీజ్ అయిన ఈ సినిమా మంచి ఘన విజయాన్ని దక్కించుకుంది.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. సంక్రాంతి పండగ కానుకగా జనవరి 11 న రిలీజ్ అయిన ఈ సినిమా మంచి ఘన విజయాన్ని దక్కించుకుంది. సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టిస్తుంది. విడుదలైన పది రోజుల్లోనే 200 కోట్ల గ్రాస్ సాధించి టాలీవుడ్ లో ట్రెండ్ సృష్టిస్తుంది.
అయితే ప్రేక్షకులకి మరింత ఉత్సాహన్ని నింపేందుకు చిత్ర యూనిట్ మరిన్ని కొన్ని సన్నివేశాలని యాడ్ చేసింది. అయితే ఈ కొత్త సన్నివేశాలు శనివారం మార్నింగ్ షో నుంచి అన్నిసెంటర్స్లలో విడుదల చేశారు.. ఈ విషయాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి ముందుగానే వెల్లడించారు. సినిమాలో భాగంగా సూపర్స్టార్ మహేష్ బాబు, రావురమేష్ ఫ్యామిలీ మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులని మరింతగా ఆకట్టుకుటున్నాయి.
ఈ సినిమాలో ముఖ్యంగా రైల్లో వచ్చే కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో మరి కొన్ని సీన్స్ యాడ్ చేసి ప్రదర్శించనున్నట్లు నిర్మాణ సంస్థ వెల్లడించింది. ఈ మేరకు నిర్మాణ సంస్థ ఓ ట్విట్ చేసింది.
ఈ సినిమాలో మహేష్ మొట్టమొదటిసారిగా ఆర్మీ లుక్ లో కనిపించారు. ఇందులో మహేష్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రంలో ప్రొఫెసర్ భారతీగా లేడీ అమితాబ్ విజయశాంతి పవర్ఫుల్ పాత్రలో నటించారు. రాజేంద్రప్రసాద్, ప్రకాష్రాజ్, సంగీత, బండ్ల గణేష్ తదితరులు నటించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, అనిల్ సుంకర, దిల్ రాజులతో కలిసి మహేష్ బాబు సినిమాని నిర్మించారు.
ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న మహేష్ ఆ తర్వాత వంశీ పైడిపల్లితో సినిమాని చేస్తున్నాడు. త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇప్పటికే వీరి కాంబినేషన్ లో మహర్షి సినిమా వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాల్లో హీరోయిన్ గా కీయరా అద్వానీ నటిస్తుందని సమాచారం. పక్కా కమర్షియల్ చిత్రంగా తెరకెక్కుతుంది. ఆ తర్వాత అనిల్ రావిపూడితో మరో సినిమా మహేశ్ బాబు చేయనున్నాడు.