ఆసుపత్రిలో చేరిన ప్రముఖ నటుడు రిషి కపూర్
పెద్దపేగులో ఇన్ఫెక్షన్ కారణంగా చికిత్స పొందుతూ మరణించిన బాలీవుడ్, హాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ నిన్న మరణించారు అన్న సంగతి మరవకముందే.
పెద్దపేగులో ఇన్ఫెక్షన్ కారణంగా చికిత్స పొందుతూ మరణించిన బాలీవుడ్, హాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ నిన్న మరణించారు అన్న సంగతి మరవకముందే.. ప్రముఖ ప్రముఖ నటుడు రిషి కపూర్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. ఆయన వయసు 67 సంవత్సరాలు. కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న రిషి కపూర్ ను ముంబైలోని సర్ హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రిలో చేర్చారు కుటుంబసభ్యులు. ఈ విషయాన్నీ ఆయన సోదరుడు రణధీర్ కపూర్ వెల్లడించారు. ప్రస్తుతం తన సోదరుడు రిషి కపూర్ ఆసుపత్రిలో ఉన్నారు.. ఆయనకు సహాయంగా వదిన ఉంది. ఆయన కొద్దిరోజులుగా క్యాన్సర్తో బాధపడుతున్నారు.. అంతేకాకుండా శ్వాస సమస్య ఉంది, కాబట్టి అతను ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ప్రస్తుతం అన్నయ్య ఆరోగ్య పరిస్థితి స్థిరంగానే ఉంది.. అని రణధీర్ పిటిఐకి చెప్పారు.. వెంటిలేటర్ మీద ఉన్నట్లు వచ్చిన రూమర్లను ఆయన తోసిపుచ్చారు.
కాగా రిషికి 2018 లో క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది.. దాంతో న్యూయార్క్లో ఒక సంవత్సరానికి పైగా ఉండి చికిత్స తీసుకున్నారు, అతని భార్య నీతు సింగ్ ఆ సమయంలో అతనితో పాటే ఉన్నారు. ఫిబ్రవరిలో, కపూర్ తన ఆరోగ్య సమస్యల కారణంగా రెండుసార్లు ఆసుపత్రి పాలయ్యాడు. అతను మొదట డెల్హి లోని ఒక ఆసుపత్రిలో చేరాడు, అక్కడ అతను కుటుంబ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ సమయంలో, కపూర్ తాను "ఇన్ఫెక్షన్" తో బాధపడుతున్నానని చెప్పారు. ముంబైకి తిరిగి వచ్చిన తరువాత, మళ్లీ వైరల్ జ్వరంతో ఆసుపత్రిలో చేరి వెంటనే డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా మరోసారి ఆసుపత్రిలో చేరడం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది.