RGV's Biopic: ఆర్జీవీ బయోపిక్ షూటింగ్ మొదలు...

Ram Gopal Varma Biopic | ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లాక్ డౌన్ సమయంలో వరుసపెట్టి సినిమాలను చేస్తున్న సంగతి తెలిసిందే..

Update: 2020-09-16 13:06 GMT

Ram Gopal Varma Biopic | ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లాక్ డౌన్ సమయంలో వరుసపెట్టి సినిమాలను చేస్తున్న సంగతి తెలిసిందే.. ఇప్పటికే మియా మల్కోవాతో క్లైమాక్స్, కరోనా వైరస్, నగ్నం వంటి సినిమాలను విడుదల చేసిన వర్మ తాజాగా రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన అమృత, ప్రణయ్ ప్రేమ కథని సినిమాగా తీయనున్నట్లుగా ప్రకటించారు. దీనికి 'మర్డర్' అనేది టైటిల్ కాగా 'కుటుంబ కథా చిత్రమ్' అనేది ట్యాగ్‌లైన్.. ఈ చిత్రనికి సంబంధించి కొద్ది రోజుల క్రితం ట్రైలర్, సాంగ్స్ కుడా రీలేజ్ చేసారు.

అయితే, కొద్ది రోజుల క్రితం రామ్ గోపాల్ వర్మ బయోపిక్ రానుంది అని ప్రకటించారు. తన బయోపిక్ ను తెరిక్కేస్తుంది ఎవరోకాదు.. స్వయంగా ఆర్జీవీయే. తన బయోపిక్ ను మూడు భాగాలుగా, మూడు సినిమాలుగా తెరకేక్కిస్తునట్లు ఆర్జీవీ తన ట్విట్టర్ ద్వారా పేర్కొన్న విషయం తెలిసిందే.. ఈ సినిమాను తన అధ్వర్యంలో దొరసాయి తేజ్ అనే నూతన దర్శకుడు తెరక్కిస్తున్నాడని, బొమ్మాకు మురళి ఈ సినిమాను నిర్మించనున్నారు. అంతే కాదు ఈ సినిమా ఫస్ట్ లుక్ ను కుడా తన ట్విట్టర్ ద్వారా ఆర్జీవీ రిలీజ్ చేసారు.

రామ్ గోపాల్ వర్మ బయోపిక్ తోలి భాగం షూటింగ్ ఇవాళ ప్రారంభమైనట్లు ఆర్జీవీ ట్వీట్ చేసాడు. తన సోదరి విజయ ఈ సినిమా ఫస్ట్ షార్ట్ కు క్లాప్ కొట్టారని అర్జీవీ చెప్పాడు. దొరసాయి తేజ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను మోమ్మకు మురళి నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ డైరెక్టర్ దొరసాయి తేజ్ వయసు 20ఏళ్ళు. ఆర్జీవీ కాలేజీ రోజుల్లోని పాత్రను అతడే పోషిస్తున్నాడు.



Tags:    

Similar News