హీరోగా మారబోతున్న శ్రీహరి తనయుడు

Update: 2019-05-22 07:45 GMT

ఒకపక్క హీరోల కొడుకులు మాత్రమే కాక మరొక పక్క దర్శకులు నిర్మాతల కొడుకులు కూడా ఇండస్ట్రీలో హీరోగా పరిచయమైన సందర్భాలు చాలానే చూసాము. తాజాగా ఇప్పుడు ఒక పాప్యులర్ నటుడి కొడుకు ఇండస్ట్రీలో హీరోగా పరిచయం కాబోతున్నాడు. అతను ఎవరో కాదు మేఘాన్ష్ శ్రీహరి. ప్రముఖ నటుడు శ్రీహరి శాంతి దంపతుల పెద్ద కుమారుడు మేఘాన్ష్ ఇప్పుడు హీరోగా మారబోతున్నాడు. 'రాజ్ దూత్' అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమా తో మేఘాన్ష్ తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. అర్జున్-కార్తీక్ సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రమోషన్స్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి.

ఒకప్పుడు రియల్ స్టార్ గా ఒక వెలుగు వెలిగిన శ్రీహరి ఆఖరిగా 'వీకెండ్ లవ్' అనే సినిమాలో నటిస్తూ చనిపోయారు. ఆయన ఆకస్మిక మరణాన్ని జీర్ణించుకోవడానికి అభిమానులకు చాలా కాలం పట్టింది. శ్రీహరి కాలం చేసినప్పుడు మేఘాన్ష్ ఇంకా స్కూల్ కు వెళ్లే పిల్లవాడే. కాబట్టి ఇండస్ట్రీలోకి అతని ఎంట్రీపై ఎవరు మాట్లాడలేదు. అయితే ఇప్పుడు మేఘాన్ష్ పెద్దవాడయ్యాడు కాబట్టి తను హీరోగా ఎప్పుడు ఇండస్ట్రీలో అడుగు పెడతాడా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూడసాగారు. ఇక తన తండ్రి ప్రతిభను పుణికిపుచ్చుకుని మేఘాన్ష్ మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకుంటాడు అని అభిమానులు ఆశిస్తున్నారు.

Similar News