కరోనా వల్ల దెబ్బ తిన్న రకుల్ ప్రీత్ కెరీర్

కరోనా కారణంగా ఇబ్బందుల్లో పడ్డ స్టార్ బ్యూటీ

Update: 2022-01-08 13:00 GMT

కరోనా వల్ల దెబ్బ తిన్న రకుల్ ప్రీత్ కెరీర్

Rakul Preet Singh: స్టార్ బ్యూటీ రకుల్ ప్రీత్ కి బాగానే అవకాశాలు వస్తున్నాయి కానీ ఆమెకు అదృష్టం మాత్రం కలిసి రావటం లేదు. ఇక టాలీవుడ్ లో మాత్రమే కాక బాలీవుడ్లో కూడా ఆమె పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. పైగా ఇప్పుడు కరోనా కారణంగా రకుల్ ప్రీత్ బాలీవుడ్ కలలు అన్నీ ఆవిరి అయిపోయాయి. దాదాపు రెండేళ్లుగా ఆమె బాలీవుడ్ పైనే ఫోకస్ చేసింది. ఎటాక్, రన్ వే 34, డాక్టర్ జి, థాంక్ గాడ్ అనే నాలుగు సినిమాలన్నీ వరుసగా పూర్తి చేసింది ఈ భామ. నాలుగు సినిమాలు ఒక దాని తర్వాత ఒకటి విడుదలకు సిద్ధం కూడా అయ్యాయి. కానీ కట్ చేస్తే థర్డ్ వేవ్ కారణంగా థియేటర్లు మూత పడ్డాయి.

దీంతో రకుల్ ప్రీత్ ఆశలన్నీ అడియాసలయ్యాయి. ఈమె నటించిన సినిమాలు థియేటర్లో విడుదల అవుతాయో లేక డైరెక్ట్ గా ఓటీటీల లో కి వెళ్లి పోతాయి అనే అనుమానాలు కూడా బయటకు వస్తున్నాయి. 2019లో "దే దే ప్యార్ దే" అనే సినిమాతో మరొకసారి బాలీవుడ్లో అడుగుపెట్టిన రకుల్ ప్రీత్ అప్పటినుంచి బాలీవుడ్ పైన దృష్టి పెట్టింది. కానీ ప్రస్తుతం నార్త్ లో ఉన్న పరిస్థితి చూస్తుంటే ఇప్పట్లో మళ్లీ ఇండస్ట్రీ పూర్వవైభవాన్ని పొందేలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే రకుల్ కెరీర్ కూడా ఇరుకుల్లో పడింది.

Tags:    

Similar News