Radhe Shyam Movie: చావుబతుకుల మధ్య పార్టీ రాధేశ్యామ్

Radhe Shyam Movie: "రాధేశ్యామ్" కథ లైఫ్ అండ్ డెత్ మధ్య జరిగే పార్టీ అంటున్న డైరెక్టర్

Update: 2021-12-14 12:24 GMT

 "రాధేశ్యామ్" కథ లైఫ్ అండ్ డెత్ మధ్య జరిగే పార్టీ అంటున్న డైరెక్టర్ (ఫైల్-ఫోటో)

Radhe Shyam Movie: ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో నటించిన "రాధే శ్యామ్" సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదల కాబోతోంది. "జిల్" ఫేమ్ రాధ కృష్ణకుమారి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా గురించి మాట్లాడుతూ దర్శకుడు రాధాకృష్ణ కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.

ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సినిమా మిగతా అన్ని లవ్ స్టోరీల లాగా ఒక క్యూట్ లవ్ స్టోరీ కాదని ఇది చావు బ్రతుకుల మధ్య జరిగే ఒక పార్టీ లాగా ఉండబోతోందని అన్నారు. "లైఫ్ కి ప్రేమకి కానీ లేక లైఫ్ కి డెత్ కి మధ్య ఒక పార్టీ జరిగితే ఎలా ఉంటుందో సినిమా అలా ఉంటుంది. అలానే చాలా ఎమోషనల్ గా ఉంటుంది. జాతకాలలో నిజం ఉందా లేదా అనే కాన్సెప్ట్ ఒక ప్రేమ కథ లో యాడ్ అయితే ఎలా ఉంటుందో ఈ సినిమాలో తెలుస్తుంది. ఈ కథతో నేను గత పదిహేనేళ్ళుగా జర్నీ చేస్తున్నాను. దానికి ఒక బ్యాక్ స్టోరీ ఉంది" అని చెప్పుకొచ్చారు చిత్ర దర్శకుడు రాధాకృష్ణ.

Tags:    

Similar News