డిస్ట్రిబ్యూటర్ల పై మండి పడుతున్న ప్రభాస్ అభిమానులు

డిస్ట్రిబ్యూటర్ల పై మండి పడుతున్న ప్రభాస్ అభిమానులు

Update: 2022-03-10 08:30 GMT

డిస్ట్రిబ్యూటర్ల పై మండి పడుతున్న ప్రభాస్ అభిమానులు

Prabhas Fans: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "రాధే శ్యామ్" సినిమా భారీ అంచనాల మధ్య మార్చి 11న విడుదలకు సిద్ధమవుతోంది. దాదాపు మూడేళ్ల తర్వాత ప్రభాస్ ను వెండితెరపై చూడడానికి అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక "రాధే శ్యామ్" అమెరికా రిలీజ్ మీద సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇంతకుముందు చిత్ర రైట్స్ ను గ్రేట్ ఇండియా ఫిలింస్ వారు సొంతం చేసుకున్నారు. ఆ సమయంలోనే అమెరికాలో 1166 లొకేషన్స్ లో సినిమాను విడుదల చేసి రికార్డు సృష్టిస్తామని ప్రమాణం చేశారు. కానీ వాళ్లు చెప్పిన దాంట్లో ఇప్పుడు సగం థియేటర్లలో కూడా సినిమా విడుదల అవటం లేదు.

షోలను ప్లాన్ చేయడంలో డిస్ట్రిబ్యూటర్లు విఫలం అయినట్లు తెలుస్తోంది. తెలుగు సినిమాలు బాగా ఆడే థియేటర్లలో ఇంకా బుకింగ్స్ ఓపెన్ కూడా అవ్వలేదు. ఇక మరోవైపు దొరికిన స్క్రీన్స్ కూడా తక్కువగా ఉండటంతో అభిమానులు కలెక్షన్లు ఎలా ఉంటాయో అని కంగారు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సినిమాని విడుదల చేస్తున్నందుకు అభిమానులు నిరాశ చెందుతున్నారు. డిస్ట్రిబ్యూటర్ల వైఖరితో కలెక్షన్లు కూడా భారీగా తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాధా కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది.

Tags:    

Similar News