Om Raut: శ్రీరాముడి పాత్రకు ప్రభాస్ మాత్రమే సరైనోడు

Update: 2021-08-23 06:00 GMT

ఆది పురుష్ (ఫైల్ ఫోటో)

Prabhas Adipuruh Movie - Om Raut: "బాహుబలి" సినిమా తో ప్యాన్ ఇండియన్ స్టార్ గా మారిపోయిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ విభిన్న భాషల దర్శకులతో వరుస సినిమాలు చేస్తున్నారు. ఒకవైపు కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో "సలార్" సినిమా తో బిజీగా ఉన్న ప్రభాస్ మరోవైపు బాలీవుడ్ దర్శకుడు ఓమ్ రౌత్ తో "ఆది పురుష్" అనే సినిమా కూడా చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న అన్న ఈ సినిమా లో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నాడు. రామాయణం ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమా లో కృతి సనన్ సీత పాత్ర పోషిస్తున్నారు. తాజాగా రాజీవ్ పసంద్ తో ఇంటర్వ్యూ లో పాల్గొన్న చిత్ర దర్శకుడు కొన్ని ఆసక్తికరమైన విషయాలను రివీల్ చేశారు.

ఈ సినిమాలో శ్రీరాముడిగా ప్రభాస్ నీ ఎందుకు ఎంచుకున్నారు అని అడగగా, ఓం రౌత్ దానికి కారణం కేవలం ప్రభాస్ కళ్ళు అంటూ తేల్చి చెప్పారు. "అతని కళ్ళు చాలా చాలా స్వచ్ఛంగా ఉంటాయి. చాలా చాలా స్వచ్ఛంగా ఉంటాయి. మన కళ్ళు మన మనసుకి ప్రతిబింబం అంటారు కదా. అందుకే ప్రభాస్ మాత్రమే ఆ పాత్రను చేయగలరు. మరెవరూ అంత బాగా చేయలేరు," అంటూ చెప్పుకొచ్చారు దర్శకుడు ఓం రౌత్. సన్నీ సింగ్ ఈ సినిమాలో లక్ష్మణుడిగా కనిపించనుండగా మరోవైపు సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడు పాత్ర పోషించనున్నారు. టి సిరీస్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Tags:    

Similar News