ఎమోషనల్ పోస్ట్ పెట్టిన మహేష్ బాబు భార్య

Namratha: ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకున్న నమ్రతా శిరోద్కర్ మహేష్ బాబుతో పెళ్లి తర్వాత సినిమాలకి దూరమై ఇంటి బాధ్యతలను చూసుకుంటూ ఉండిపోయారు.

Update: 2022-02-02 07:03 GMT

ఎమోషనల్ పోస్ట్ పెట్టిన మహేష్ బాబు భార్య

Namratha: ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకున్న నమ్రతా శిరోద్కర్ మహేష్ బాబుతో పెళ్లి తర్వాత సినిమాలకి దూరమై ఇంటి బాధ్యతలను చూసుకుంటూ ఉండిపోయారు. ఒక వైపు తమ ఇద్దరు పిల్లలు గౌతమ్ మరియు సితారను చూసుకుంటూనే మహేష్ బాబు సినిమాల విషయంలో కూడా చేదోడువాదోడుగా ఉంటుంది. సోషల్ మీడియాలో కూడా ఆక్టివ్ గా ఉండే నమృత ఎప్పటికప్పుడు పిల్లల గురించి లేదా మహేష్ బాబు కి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా తన తల్లిదండ్రుల గురించి ఒక పోస్ట్ ఎమోషనల్ పోస్ట్ ని షేర్ చేశారు నమ్రత.

చనిపోయిన తన తండ్రిని తలచుకుంటూ నమ్రత ఒక ఎమోషనల్ పోస్టు పెట్టారు. "నేను ఎప్పుడు ఒంటరిగా లేను. ఎందుకంటే ఎప్పుడూ నా జీవితంలో నా వెనక ఒక అదృశ్య శక్తి లా మీరు ఉన్నారు. మీ వల్లే నేను ఈరోజు ఇలా నిలుచున్నాను. మీరే నా వెనక ఉండి నాకు ధైర్యాన్ని ఇచ్చారు. అదే తండ్రి ప్రేమ. పదహారేళ్లుగా నేను మిమ్మల్ని ప్రతిరోజు మిస్ అవుతున్నాను. నా హృదయంలో మీపై ఉన్న ప్రేమ ఎప్పటికీ అలానే ఉంటుంది. మీరు ఎక్కడున్నా నన్ను చూసి ఎంతో గర్వంగా ఫీల్ అవుతారని భావిస్తున్నాను" అని తన తండ్రి ఫోటోను కూడా ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది నమ్రత. 

Tags:    

Similar News