Mahesh Babu: సంక్రాంతి తర్వాత సెట్స్ పైకి వెళ్లనున్న మహేష్ బాబు

*ఈ సినిమాని డిసెంబర్ లో లాంచ్ చేయబోతున్నట్లు సమాచారం.

Update: 2021-11-07 16:00 GMT

సంక్రాంతి తర్వాతే షూటింగ్ అంటున్న మహేష్ బాబు(ఫైల్ ఫోటో)

Mahesh Babu: ఈ మధ్యనే "సరిలేరు నీకెవ్వరు" సినిమా తో బ్లాక్ బస్టర్ అందుకున్న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు పరశురామ్ దర్శకత్వంలో "సర్కారు వారి పాట" అనే సినిమాతో బిజీగా ఉన్నారు. కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్ గా కనిపించనున్నారు.

ఇక ఈ సినిమా తరువాత మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. అతడు, ఖలేజా సినిమాల తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మూడో సినిమా ఇది. పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది.

"మహర్షి" సినిమా తర్వాత మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న రెండవ సినిమా ఇది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాని డిసెంబర్ లో లాంచ్ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాత సెట్స్ పైకి వెళ్ళబోతున్నట్టు తెలుస్తోంది.

ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. ఎస్ ఎస్ థమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించనున్నారు. మధీ ఛాయాగ్రహణం వహిస్తున్న ఈ సినిమాని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.

Tags:    

Similar News