Krishnam Raju: ఆరోగ్యం పై క్లారిటీ ఇచ్చిన కృష్ణంరాజు

Krishnam Raju: పుకార్ల పై రియాక్ట్ అయిన కృష్ణంరాజు తన ఆరోగ్యం గురించి క్లారిటీ ఇచ్చారు

Update: 2021-09-14 14:00 GMT

కృష్ణం రాజు  (ఫోటో- ది హన్స్ ఇండియా)

Krishnam Raju: గత కొంతకాలంగా రెబల్ స్టార్ కృష్ణంరాజు ఆరోగ్యం క్షీణిస్తోందని పుకార్లు ఇంటర్నెట్లో వైరల్ గా మారాయి. అయితే తాజాగా ఈ పుకార్ల పై రియాక్ట్ అయిన కృష్ణంరాజు తన ఆరోగ్యం గురించి క్లారిటీ ఇచ్చారు. ఈ మధ్యనే కృష్ణంరాజు ఆరోగ్యం పాడవడంతో జూబ్లీహిల్స్లోని అపోలో హాస్పిటల్ లో చూపించుకున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపించాయి. కానీ ఈ పుకార్లను కొట్టిపారేసిన కృష్ణంరాజు తాను ఆరోగ్యంగా ఉన్నానని, తొందర్లోనే యునైటెడ్ కింగ్డమ్ కు వెళ్ళబోతున్నాను అని, అందుకే చెకప్ కోసం అపోలో లోని డాక్టర్ వద్దకు వెళ్లి రొటీన్ ప్రాసెస్ లో పాల్గొన్నట్లు తెలిపారు కృష్ణంరాజు.

ఇక ఈ మధ్యనే బైక్ యాక్సిడెంట్ అయి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న మెగాహీరో సాయి ధరమ్ తేజ్ ను కూడా చూసి వచ్చిన కృష్ణంరాజు, తేజ్ త్వరగా కోలుకోవాలని అన్నారు. ఇక సినిమాల పరంగా చూస్తే త్వరలోనే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "రాధేశ్యామ్" సినిమాలో ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు కృష్ణంరాజు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ని యు.వి.క్రియేషన్స్ మరియు టి సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. భారీ అంచనాలు మధ్య ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదలకు సిద్ధమైంది.

Tags:    

Similar News