విరాట్ కోహ్లీపై కంగనా రనౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు
సీనియర్ మహిళా న్యాయవాది ఇందిరా జైసింగ్పై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఘాటుగా స్పందించిన సంగతి తెలిసిందే. తాజాగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బాలీవుడ్ నటి కంగనా రనౌత్
సీనియర్ మహిళా న్యాయవాది ఇందిరా జైసింగ్పై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఘాటుగా స్పందించిన సంగతి తెలిసిందే. తాజాగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బాలీవుడ్ నటి కంగనా రనౌత్. విరాట్ కోహ్లీకి తనకు పోలికలు ఉన్నాయని కంగనా రనౌత్ అన్నారు. ఎక్కువ అభిమానులను మంది అభిమానులకు సంపాదించుకున్నామని, అలాగే అనేక వివాదాలు కూడా తాము ఎదుర్కొన్నామని తెలిపారు.
కంగనా రనౌత్ నటించిన హిందీ సినిమా 'పంగా' శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఆమె విరాట్ మాట్లాడారు.శుక్రవారం విడుదలైనా పంగా సినిమా మంచి ప్రేక్షకుల ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో కంగనా రనౌత్ కబడ్డీ క్రీడాకారిణిగా నటించారు. అశ్వినీ అయ్యర్ తివారి దర్శకత్వం వహించారు. ఈషాన్ నూరానీ, శంకర్ మహదేవన్, లాయ్ మెడోస్నా బాణీలు అందించారు.
''విరాట్ కోహ్లీకి నాకు కొన్ని విషయాల్లో పోలికలు ఉన్నాయని కొందరు చెబుతారని. విరాట్ కోహ్లీ క్రికెట్లో గొప్ప పేరు సంపాదించారు. అతనికి ఎంతో మంది ప్రేమిస్తారు. కోహ్లీకి దూకుడు ఎక్కువని విమర్శిస్తుంటారు. కోహ్లీలానే నేను కూడా దూకుడుగా ఉంటా.. మేము ఇద్దరం చాలా వివాదాలు ఎదుర్కొన్నాం. అంతకంటే ఎక్కువ అభిమానులను సంపాదించాం.. ఆటగాళ్ల జీవితం సులువైంది కాదు, ఎన్నో కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఫిటెనెస్ కోసం శ్రమిస్తారు. ఆటకోసం ఎంతగానో తపిస్తారు" అని కంగనా పేర్కొన్నారు.
ఇటీవలే కంగనా రనౌత్ సీనియర్ మహిళా న్యాయవాది ఇందిరా జైసింగ్ వ్యాఖ్యలపై విమర్శలు చేశారు. నిర్భయ తల్లి ఆశాదేవి కూడా కంగనాకు మద్దతుగా నిలిచింది. నిర్భయ దోషులను క్షమించాలని, రాజీవ్ గాంధీ హత్య కేసులో నళినీని సోనియా గాంధీ క్షమించారని, ఆమెకు ఉరిశిక్ష పడాలని కోరుకోలేదని గుర్తు చేశారు. సోనియాను చూసి నిర్భయ తల్లిని కోరుతున్నానని అన్నారు. అయితే దీనిని కంగనా తప్పుబట్టారు. ఇందిరా జైసింగ్ వ్యాఖ్యలు సరైంది కాదని విమర్శించారు. అలాంటి మహిళలను దోషులతో పాటు నాలుగు రోజుల పాటు జైళ్లో ఉంచాలి, కచ్చితంగా వారితో కలిసి ఉండేలా చేయాలి. అప్పుడే ఆ బాధ ఏంటో తెలుస్తుంది. ఇలాంటి వాళ్లే మృగాళ్లకు, హంతకులకు జన్మనిస్తారు అని తీవ్ర స్థాయిలో కంగనా రనౌత్ విమర్శించిన సంగతి తెలిసిందే.