బిగ్బాస్ 3 గ్రాండ్ ఫైనల్లోకి ముగ్గురు టాప్ హీరోయిన్లు
తెలుగు బిగ్ బాస్ మూడో సీజన్ ముగింపు దశకు చేరింది. ఈ సీజన్ చివరి వారం ప్రస్తుతం ఐదుగురు ఫైనలిస్టులో కొనసాగుతున్నారు.
తెలుగు బిగ్ బాస్ మూడో సీజన్ ముగింపు దశకు చేరింది. ఈ సీజన్ చివరి వారం ప్రస్తుతం ఐదుగురు ఫైనలిస్టులో కొనసాగుతున్నారు. ఈ ఫైనల్ ఆదివారం సాయంత్రం 6.30గంటలకు జరగబోతుంది. బిగ్ బాస్ మూడో సీజన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న కింగ్ నాగార్జున పైనల్ రోజు కూడా హోస్ట్ చేయనన్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం మన్మధుడు నాగార్జునతో మరో ముగ్గురు నటీమలు ఈ కార్యక్రమంలో హాజరు కానున్నట్లు సమాచారం. నిధి అగర్వాల్, కేథరీనా, అంజలి ఈ షోలోకి రాబోతున్నారు. బిగ్ బాస్ చివరి రోజు కావడంతో ఈ ముగ్గురు ముద్దుగుమ్మలు కూడా బిగ్బాస్ సెట్లో అదిరిపోయే ఫర్మామెన్స్ చేయనున్నారు.
అయితే వీరే కాకుండా సైరా నరసింహారెడ్డి చిత్రం విజయం అందుకుని జోష్ మీదున్న మెగాస్ఠార్ చిరంజీవి కూడా ఈ షోకి హాజరు అవుతారని పుకార్లు వస్తున్నాయి. అయితే అధికారికంగా బిగ్బాస్ వర్గాలు నుంచి ఏటువంటి సమాచారం లేదు.
బిగ్బాస్3 సీజన్లో ఫైనలిస్టులు వరుణ్ సందేశ్, రాహుల్, శ్రీముఖి, బాబా బాస్కర్, అలీ రెజా హౌస్లో ఉన్నారు. ఈ ఐదుగురిలో ఎవరు విజేయతగా నిలిచారో తెలియాలంటే మరి కొన్ని గంటలు ఆగాల్సిందే. ఎలిమినేట్ అయిన పార్టిసిపెంట్స్ మళ్ళీ ఇంట్లోకి ప్రవేశించి గ్రాండ్ రీయూనియన్ రెట్రో పార్టీని జరుపుకుంటున్నారు.