సౌత్ యంగ్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్స్.. ఎవరు ఎంత తీసుకుంటారంటే..?

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనేది నానుడి.ఫామ్‌లో ఉన్నప్పుడే ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారు హీరోయిన్స్‌.

Update: 2025-01-24 09:38 GMT

సౌత్ యంగ్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్స్.. ఎవరు ఎంత తీసుకుంటారంటే..

Tollywood Heroins Remunartions: దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనేది నానుడి.ఫామ్‌లో ఉన్నప్పుడే ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారు హీరోయిన్స్‌. గత కొన్నేళ్లుగా మన దక్షిణాది భామలే ఉత్తరాదిని శాసిస్తున్నారు. దీంతో బాలీవుడ్ భామలకు ఏ మాత్రం తగ్గకుండా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. నిర్మాతలు సైతం వాళ్ల ఇమేజ్‌కు తగ్గట్టుగా పారితోషికాలు ఇస్తున్నారు. ప్రస్తుతం ఏ హీరోయిన్ ఎంత పారితోషికం తీసుకుంటున్నారో చూద్దాం.

పుష్ప సిరీస్‌తో పాటు యానిమల్ సినిమాతో రష్మిక మందన్న క్రేజ్ మామూలుగా లేదు. ఛావా, సికిందర్, కుబేర సినిమాల్లో నటిస్తున్నారు. అయితే ప్రస్తుతం రష్మిక ఒక్కో సినిమాకు రూ.3 కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్టు సమాచారం. ఈ సినిమాలన్నీ హిట్టైతే.. ఈ అమ్మడుకు తిరుగులేదు. దీంతో రెమ్యూనరేషన్ భారీగా పెంచే ఛాన్స్ ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం శ్రీలీల కూడా మంచి ఫామ్‌లో ఉన్నారు. గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడత పెట్టి సాంగ్‌తో ఈమె క్రేజ్ ఇంటర్నేషనల్ లెవల్‌కు పెరిగింది. రీసెంట్‌గా పుష్ప2‌లో కిస్సిక్ సాంగ్ కోసం దాదాపు రూ.కోటి పారితోషికం తీసుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ అమ్మడు ఒక్కో సినిమాకు రూ.2 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.

కియారా అద్వానీ ప్యాన్ ఇండియా హీరోయిన్‌గా సత్తా చాటుతోంది. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాలో దాదాపు రూ.3 కోట్ల వరకు పారితోషికం తీసుకున్నట్టు సమాచారం. రాధే శ్యామ్ ముందు వరకు ఫుల్ ఫామ్‌లో ఉన్న పూజా హెగ్డే ఆ తర్వాత వరుస ఫ్లాపులతో డౌన్ అయ్యారు. ప్రస్తుతం పూజా చేతిలో ఒకటి, రెండు సినిమాలు మాత్రమే ఉన్నాయి. కానీ ఒక్కో సినిమాకు ఈ అమ్మడు రూ.3 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.

సాయి పల్లవి ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్‌లో తన సత్తా చాటుతున్నారు. అయితే ఈ మధ్య వరకు రూ.1.5 కోటి పారితోషికం తీసుకునే సాయిపల్లవి.. ఇటీవల తన సినిమాలు మంచి సక్సెస్ కావడంతో తన రెమ్యూనరేషన్ పెంచేశారు. నాగ చైతన్య, చందూ మొండేటి కాంబోలో వస్తున్న తండేల్ సినిమా కోసం రూ.2కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటోంది. బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న రామాయణం మూవీ కోసం ఏకంగా రూ.5 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం.

కీర్తి సురేష్ దక్షిణాదిలోని అన్ని భాషల్లో సత్తా చాటుతోంది. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.2 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం. రాశి ఖన్నా ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీ సహా పలు భాషల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఒక్కో సినిమాకు రూ.60 లక్షల నుంచి రూ.కోటి వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం. నిధి అగర్వాల్ ఒక్కో చిత్రానికి రూ. కోటి వరకు పారితోషికం అందుకుంటోంది. ప్రస్తుతం ఈ భామ హరి హర వీరమల్లు, ది రాజా సాబ్ సినిమాల్లో నటిస్తున్నారు.

Tags:    

Similar News