Director Krish: ఆమె అసలు హీరోయిన్ కాదు అంటున్న క్రిష్

Director Krish: జాక్వెలిన్ విషయంలో ట్విస్ట్ ఇచ్చిన క్రిష్

Update: 2021-12-19 11:30 GMT

జాక్వెలిన్ విషయంలో ట్విస్ట్ ఇచ్చిన క్రిష్(ఫైల్-ఫోటో) 

Director Krish: పవర్స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన "భీమ్లా నాయక్" సినిమా వచ్చే ఏడాది జనవరి 12న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో "హరి హర వీర మల్లు" అనే సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. పీరియడ్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ముందుగా ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్ గా అనుకున్నారు దర్శక నిర్మాతలు. ఈ సినిమాలో ఆమె ఒక యువరాణి పాత్రలో కనిపించబోతునట్లు వార్తలు కూడా బయటకు వచ్చాయి.

కానీ ఈ మధ్యనే రెండు వందల కోట్ల స్కామ్ లో తను కూడా భాగమేనని వార్తలు వచ్చాక ఆమెని తీసేసి ఆమె పాత్రలో మరొక బాలీవుడ్ బ్యూటీ నర్గీస్ ఫక్రి ని రంగంలోకి దింపినట్లు వార్తలు వినిపించాయి. అయితే దీని గురించి మాట్లాడుతూ డైరెక్టర్ క్రిష్ ఒక షాకింగ్ ట్విస్ట్ ఇచ్చారు. అసలు జాక్వలిన్ ఫెర్నాండెజ్ ను వాళ్లు ఎంపిక చేయలేదని, అనే డేట్లు కుదరకపోవడంతో ఆమె ముందు నుంచి ఈ సినిమాలో భాగం కాదని కన్ఫామ్ చేశారు. ప్రస్తుతం తన పాత్ర షూటింగ్ తో బిజీగా ఉంది నర్గీస్. మరోవైపు జాక్వెలిన్ గురించి క్రిష్ ఒక షాకింగ్ ట్విస్ట్ ఇచ్చారు.

Tags:    

Similar News