Rashmi: చిరుతో మాస్ మసాలా పాట చేస్తున్నాను అంటున్న రష్మి

* మెగా స్టార్ నా భయాన్ని ఇట్టే పోగొట్టేశారు అంటున్న రష్మి

Update: 2021-11-28 06:00 GMT

చిరు తో మాస్ మసాలా పాట చేస్తున్నాను అంటున్న రష్మి(ట్విట్టర్ ఫోటో)

Rashmi: మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న "బోళా శంకర్" సినిమాలో ప్రముఖ యాంకర్ రష్మి గౌతమ్ స్పెషల్ సాంగ్ లో చిరుతో కలిసి స్టెప్పులు చేయబోతున్న సంగతి తెలిసిందే.

ఇలా చిరంజీవి సినిమాలో అవకాశం అని అన్న వెంటనే కనీసం ఆయనని మాట పూర్తి చేయకుండానే వెంటనే ఓకే చెప్పేసిందట రష్మి. అయితే ఆ పాటని స్పెషల్ సాంగ్ అని పిలవడం కంటే ఎంటర్టైనింగ్ అని అనటం బాగుంటుందని అంటోంది. అది ఒక పూర్తి మాస్ మసాలా పాట గా ఉండబోతుందట.

"చిరంజీవి గారు సింగిల్ షాట్ లోనే డాన్స్ మూమెంట్స్ ని ఓకే చేసేస్తారు. కానీ నేను ఎంత రిహార్సల్ చేసినప్పటికీ ఆయన పక్కన డాన్స్ చేయడం అంటే చాలా టెన్షన్ గా అనిపించేది. అప్పుడు నా భయాన్ని అర్థం చేసుకున్న మెగాస్టార్ నన్ను చాలా ఎంకరేజ్ చేశారు.

ఆయనతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది" అని చెప్పుకొచ్చింది రష్మి. ఇక చిరంజీవి పాటలలో "ఏంది బే ఎట్టాగ ఉంది ఒళ్ళు" పాట అంటే తనకు చాలా ఇష్టమని చెప్పిన రష్మీ ఇప్పుడు పెద్దయ్యాక ఆయనతో ఒకే తెరపై కనిపించడం ఆనందంగా ఉందని చెప్పుకొచ్చింది.

Tags:    

Similar News