Chiranjeevi: రాజకీయాలకు దూరంగా.. సినిమాలకు దగ్గరగా ఉంటాను.. చిరంజీవి సంచలన వ్యాఖ్యలు
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయాల వైపు మళ్లీ వెళ్తానేమోనని పలువురు అనుకుంటున్నారని..జీవితాంతం కళామతల్లి సేవలోనే ఉంటానని స్పష్టం చేశారు. సినీరంగానికి సేవల కోసమే రాజకీయ పెద్దలను కలుస్తానని , అంతకుమించి ఏమీ లేదన్నారు. రాజకీయంగా తాను అనుకున్న లక్ష్యాలు, సేవలు నెరవేర్చేందుకు తన సోదరుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉన్నారని చిరంజీవి తెలిపారు. హైదరాబాద్ లో జరిగిన బ్రహ్మ ఆనందం ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిరంజీవి ఈ వ్యాఖ్యలు చేశారు. జీవితాంతం రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలకు దగ్గరగా ఉంటాను అన్నారు. పెద్ద పెద్ద వారిని కలుస్తున్నాడు ఏంటీ..అటు వైపు ఏమైనా వెళ్తాడా అని కొందమంది సందేహపడుతున్నారు. అలాంటి అనుమానాలు పెట్టుకోవద్దు అని అన్నారు.
బ్రహ్మానందం ఆయన కుమారుడు రాజాగౌతమ్ తాత మనవళ్లుగా నటించిన సినిమా బ్రహ్మా ఆనందం. ప్రియ వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్, వెన్నెల కిషోర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ మూవీ ఫిబ్రవరి 14న బాక్సాఫీస్ ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేడుకకు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈమధ్యే జరిగిన లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కూడా ముఖ్య అతిథిగా వెళ్లారు. నేను తప్ప ఎవరు లేరా అని మీకు అనిపించవచ్చు. ఎక్కువ చిత్రాలు వస్తున్న కారణంగా దానికి తగ్గట్టే వేడుకలు చేయాల్సిన వస్తుంది. సినిమాకు కథ ఎంత ముఖ్యమో దాని విడుదల తేదీ కూడా అంతే ముఖ్యం. ప్రేక్షకులకు చేరువ చేయడం అత్యంత ప్రాధాన్యం. దర్శకుడు అనిల్ రావిపూడి ఈమధ్య అద్భుతంగా సినీ ప్రచారం చేశారు. ఎక్కడ చూసినా ఈ మూవీ టీమ్ కనిపించేది అని చిరంజీవి పేర్కొన్నారు.