పూరి వల్ల నష్టాలు ఎదుర్కొంటున్న చార్మి

Charmy Kaur: పూరి మాట విని నష్టాలు అనుభవిస్తున్న చార్మి

Update: 2022-08-30 08:30 GMT

పూరి వల్ల నష్టాలు ఎదుర్కొంటున్న చార్మి 

Charmy Kaur: ఈ మధ్యనే "ఇస్మార్ట్ శంకర్" సినిమాతో సూపర్ హిట్ అందుకున్న డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ అదే జోరుతో "లైగర్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. విజయ్ దేవరకొండ హీరోగా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో నడిచే ఈ సినిమాలో విజయ్ బాక్సర్ పాత్రలో కనిపించారు. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. సినిమా విడుదలకి ముందు ఈ సినిమాకి ఓటీటీ ప్లాట్ఫార్మ్స్ నుంచి బోలెడు మంచి మంచి ఆఫర్లు వచ్చాయని తెలుస్తోంది. చార్మి కూడా ఒక ప్రమోషన్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయాన్ని ఒప్పుకున్నారు. కానీ పూరీ జగన్నాథ్ మాత్రం ఈ సినిమాని థియేటర్లలోనే విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు.

అందుకే వచ్చిన ఓటీటీ ఆఫర్లు అన్నిటిని పూరి జగన్నాథ్ కాదనుకొని సినిమాని థియేటర్లలోనే విడుదల చేశారు. కానీ విడుదలైన మొదటి రోజు నుంచి ఈ సినిమా నెగిటివ్ రెస్పాన్స్ ను అందుకుంటూ ఇప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఒకవైపు డిస్ట్రిబ్యూటర్లతో పాటు సినిమాకి సహనిర్మాతగా వ్యవహరించిన చార్మికి కూడా సినిమా వల్ల భారీ నష్టాలు వాటిల్లాయి. ఒకవేళ సినిమాకి వచ్చిన ఓటీటీ ఆఫర్లను ఒప్పుకొని ఉండుంటే చార్మి కనీసం కొంచెం అయినా ప్రాఫిట్లను అందుకుని ఉండేది. కానీ పూరీ జగన్నాథ్ వల్ల ఇప్పుడు చార్మికి భారీ నష్టాలు ఏర్పడ్డాయి.

Tags:    

Similar News