గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న సంజయ్ దత్

రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు సెలబ్రిటీల నుంచి మంచి ఆదరణ కనిపిస్తోంది.గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా సవాల్ అందుకున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ మొక్కలు నాటి అభినందనలు తెలిపారు.

Update: 2020-12-08 06:57 GMT

రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు సెలబ్రిటీల నుంచి మంచి ఆదరణ కనిపిస్తోంది.గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా సవాల్ అందుకున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ మొక్కలు నాటి అభినందనలు తెలిపారు. ఎంపీ సంతోష్ తో కలసి హైదరాబాద్ శిల్పారామంలో మొక్కలు నాటారు.దేశ వ్యాప్తంగా పచ్చదనం పెంచేందుకు ఇదొక అద్భుతమైన కార్యక్రమమని సంజయ్ దత్ ప్రశంసించారు. ఈరోజుఎంపీ సంతోష్ కుమార్ పుట్టిన రోజు కావడంతో సంజయ్ దత్ ఆయన్ను అభినందించారు.మొక్కలు నాటిన ప్రతీ ఒక్కరు మరో ముగ్గురికి సవాల్ విసరాలని మొక్కలు నాటే సంస్కృతి పెంచాలని సంతోష్ కోరారు.

Tags:    

Similar News