కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్బాస్ రియాల్టీ షో ముగింపు దశకు వచ్చింది. దాదాపు 105 రోజులుగా సాగిన ఈ షోలో ఎన్నో ఊహించని మలుపులు తిరిగింది. ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో రాహుల్ సిప్లిగంజ్ టైటిల్ సొంతం చేసుకున్నారంటూ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. శ్రీముఖి, రాహుల్ కు ఫైనల్లో గట్టి పోటీ నడిచిందని, కొద్దిపాటి ఓట్లతో రాహుల్ విజయం సాధించాడని వదంతులు వస్తున్నాయి. నాగ్ మాత్రం వదంతులను ఖండించారు. విన్నర్ ఎవరనేది ప్రత్యక్ష ప్రసారంలో చూడాలని పేర్కొన్నారు.
గ్రాండ్ ఫినాలే టాలీవుడ్ స్టార్స్ కూడా ఈ రోజు సందడి చేరనున్నారు. మన్మధుడు నాగ్ తో కలిసి రాశీఖన్నా, అంజలిలు కూడా ఈ షోకి వచ్చారు. కేథరిన్ థ్రెస్సా, నిధి అగర్వాల్ బిగ్ బాస్ స్టేజ్ పై మరింత హీట్ పెంచారు. అయితే మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరవుతారన్న ప్రచారం జరుగుతోంది. కొందరు బుల్లితెర నటీనటులు కూడా బిగ్బాస్కు వచ్చారు. కానీ, స్టార్ మా విడుదల చేసిన ప్రొమోలో చిరంజీవి ఎక్కడ కనిపించలేదు.
చిరంజీవి వస్తాడన్న వార్తలు ఆయన అభిమానులును ఉత్సహపరిచాయి. అయితే ప్రొమోలో ఎక్కడ చిరంజీవి లేకపోవండంలో కొంత నిరుత్సానికి గురిచేశాయి. అయితే ప్రేక్షకులను సర్ప్రైజ్ చేసేందుకు చిరంజీవిని చూపించలేదా? అనే అనుమానం కలుగుతోంది. చిరు రాకపై బిగ్బాస్ మొదలు అయ్యేవరకు ఉత్కంఠ మాత్రం వీడదు. ఎమో బిగ్ బాస్ ఏదైనా జరగవచ్చు. ప్రస్తుతం హౌజ్లో రాహుల్ సిప్లిగంజ్, శ్రీముఖి, వరుణ్, బాబా భాస్కర్, అలీ రెజాలు ఫెనలిస్టులు ఉన్నారు.