ఎన్టీఆర్ అంటే ఆమెకు ఎంతో అభిమానం

ఈమేరకు ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టారు. గీతాంజలి మరణించారన్న వార్త తనను షాక్‌కు గురిచేసిందని పేర్కొన్నారు. తమ కుటుంబంతో ఆమెకు మంచి అనుబంధం ఉందని పేర్కొన్నారు.

Update: 2019-10-31 10:40 GMT

సీనియర్ నటి గీతాంజలి గుండెపోటుతో గురువారం ఉదయం కన్నుమూశారు. ఆమె మృతిపై పలువువు టాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగా సినీనటుడు నందమూరి బాలకృష్ణ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈమేరకు ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టారు. గీతాంజలి మరణించారన్న వార్త తనను షాక్‌కు గురిచేసిందని పేర్కొన్నారు. తమ కుటుంబంతో ఆమెకు మంచి అనుబంధం ఉందని పేర్కొన్నారు. ఎన్టీఆర్ అంటే ఆమెకు ఎంతో అభిమానమని తెలిపారు. సీతారామ కళ్యాణం చిత్రంలో సీత పాత్రలో అద్భుతంగా నటించారని బాలకృష్ణ పేర్కొన్నారు. ఆమె కుటుంబానికి భగవంతుడు మనోదైర్యానివ్వాలని బాలకృష్ణ ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు.

గీతాంజలి 1947లో తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడలో జన్మించారు. సినిమాల మీద అభిమానంతో ఆమె చిత్రసీమలో అడుగుపెట్టారు. తెలుగు చిత్రాలతో పాటు వివిధ భాషల్లోకూడా నటించారు. ఇప్పటి వరకూ 500 చిత్రాలపైగా ఆమె నటించారు. తెలుగు సుప్రసిద్ధ నటుడు రామకృష్ణను గీతాంజలి వివాహం చేసుకున్నారు. 

Full View

Tags:    

Similar News