Anchor Sreemukhi : ఓటీటీ లోనే శ్రీముఖి సినిమా?

Anchor Sreemukhi : లాక్ డౌన్ వలన బాగా నష్టపోయిన రంగాలలో సినిమా ఇండస్ట్రీ ఒకటి.. షూటింగ్ లు ఆగిపోవడం, థియేటర్లు బంద్ కావడంతో సినిమా

Update: 2020-08-27 10:26 GMT

sreemukhi its time to party

Anchor Sreemukhi : లాక్ డౌన్ వలన బాగా నష్టపోయిన రంగాలలో సినిమా ఇండస్ట్రీ ఒకటి.. షూటింగ్ లు ఆగిపోవడం, థియేటర్లు బంద్ కావడంతో సినిమా ఇండస్ట్రీ అయితే కొన్ని కోట్ల నష్టాన్ని చవిచూసింది.. తాజాగా కేంద్ర ప్రభుత్వం షూటింగ్ లకి అనుమతి ఇవ్వడంతో గైడ్ లైన్స్ ఆధారంగా బుల్లితెర, వెండితెరకి సంబంధించిన షూటింగ్ లు మళ్ళీ పట్టాలేక్కుతున్నాయి. ఇక ధియేటర్లు ఓపెన్ కాకపోవడంతో విడుదలకి సిద్దంగా ఉన్న సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే కీర్తి సురేష్ పెంగ్విన్, సిద్దు హీరోగా నటించిన కృష్ణ అండ్ హీజ్ లీలా, నవీన్ చంద్ర భానుమతి & రామకృష్ణ మొదలగు చిత్రాలు ఓటీటీలో రిలీజ్ అయి మంచి టాక్ ను సంపాదించుకున్నాయి.

ఇప్పుడు ఇదే బాటలో శ్రీముఖి మెయిన్ లీడ్ లో నటించిన 'ఇట్స్ టైమ్ టు పార్టీ` అనే సినిమాని కూడా ఓటీటీలోనే రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. గౌతమ్ ఈవీఎస్ దర్శకత్వం వహించిన థ్రిల్లర్ మూవీని సెప్టెంబర్ 11 న OTT లో రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. త్వరలో దీనిపైన అధికార ప్రకటన వెలువడనుంది.. ఇక బుల్లితెర పైన 'ప‌టాస్' అనే షోతో పాపులారిటీ సంపాదించుకుంది.. ఇక 'బిగ్‌బాస్ సీజ‌న్‌-3'లో ర‌న్నర‌ప్‌గా నిలిచి మరింత ఫేం సంపాదించుకుంది శ్రీముఖి.. దీనితో శ్రీముఖి ఉన్న ఫాలోయింగ్‌కి గాను ఓటీటీలో రిలీజ్ చేసిన బాగానే కలిసి వస్తోందని మేకర్స్ భావిస్తున్నారు. 

Tags:    

Similar News