నవంబర్ 29 తర్వాత బీజీగా ఉంటా.. ఎందుకంటే ?

నితిన్ హిరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన హార్ట్ ఎటాట్ సిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అందాల నటి అదాశర్మ.

Update: 2019-11-06 05:35 GMT
adah sharma

నితిన్ హిరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన హార్ట్ ఎటాట్ సిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అందాల నటి అదాశర్మ. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఈ భామ ఆకట్టుకుంది. ఆ తర్వాత అందాల ఆరబోసింది. మొదట్లో తెలుగమ్మయిలా అనిపించిన ముద్దుగుమ్మ.. ఆ తర్వాత గ్లామర్ షోలో హద్దులు దాటింది.

అయితే ఎంత చేసినా అదాకు సక్సెస్‌ రాలేదు .అల్లుఅర్జున్ సరసన సన్నాఫ్‌ సత్యమూర్తి, సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌ సిమాలోనూ చిన్న పాత్రలు వేసింది. సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌ సినిమాలో ఆమె పాత్రను అభిమానులను నొప్పించిందనే చెప్పాలి. అనసూయ, అడవి శేష్ , ఆదాశర్శ కలిసి నటించిన చిత్రం క్షణం, సూపర్ హిట్ గా నిలిచింది. అయినప్పటికీ అదాశర్మకు క్రిడెట్ దక్కలేదు. ఇక తెలుగులో అవకాశాలలు దక్కకపోవడంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. కమాండో 3తో పాటు పలు బాలీవుడ్ సినిమాల్లో నటిస్తోంది.

బాలీవుడ్‌లో అదా శర్మ నటించిన కమాండో సిరీస్‌ మంచి విజయం అందుకుంది. ఈ సిరీస్ లోని మూడో భాగం తర్వలోనే ప్రేక్షకుల నవంబర్‌ 29న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. విద్యుత్‌ జమ్వాల్‌ హీరోగా నటించారు. చిత్ర యూనిట్ నిర్వహించిన ప్రమోషన్ కార్యక్రమాల్లో ఆదా శర్మ కూడా పాల్గొంది. ఈ చిత్రంలో హీరో పాటు తాను చేసిన యాక్షన్ సీన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. నేను నవంబర్‌ 29 వరకు అందుబాటులో ఉంటాను .. కమాండో 3 రిలీజ్, భావన రెడ్డితో బిజీగా ఉంటాను అంటూ అదా శర్మ పోస్ట్ పెట్టింది. 



Tags:    

Similar News