Coronaనుంచి కోలుకున్న ఎన్టీఆర్ హీరోయిన్

CoronaVirus:కరోనా వైరస్ రెండో దశ దేశవ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తుంది.

Update: 2021-05-01 15:45 GMT

సమీరా రెడ్డి  ఫైల్ ఫోటో 

CoronaVirus: కరోనా వైరస్ రెండో దశ దేశవ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తుంది. సెలబ్రీటిల నుంచి సామాన్యుల వరకు అందరిని ఈ మహమ్మరి వదలిపెట్టడం లేదు. సెంకడ్ వేవ్ లో చాలా మంది ప్రముఖలు కరోనా బారినపడ్డారు. బాలీవుడ్‌ హీరోయిన్ సమీరా రెడ్డి కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని సమీరా రెడ్డి ఆదివారం సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది. 'నాకు కరోనావైరస్‌ పాజిటివ్‌ అని తేలింది. ఇంట్లో క్వారంటైన్‌లో ఉన్నాను. ప్రస్తుతానికి నేను క్షేమంగానే ఉన్నాను. నా ముఖం మీద చిరునవ్వు తీసుకొచ్చే ఎందరో నా చుట్టూరా ఉన్నారు. ఇక ఇలాంటి సమయంలోనే మనం పాజిటివ్‌గా ధృడంగా ఉండాలి' అని రాసుకొచ్చింది.

కరోనా నుంచి ఆమె కోలుకున్నట్లు నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని సమీరా సోషల్‌మీడియా ద్వారా వెల్లడించింది.'నా ఫ్యామిలీ సురక్షితంగా ఉందని తెలిపేందుకు ఎంతో సంతోషిస్తున్నా. అందరూ పడుతున్న కష్టాలు చూస్తుంటే మనస్సు తరుక్కుపోతుంది. గత రెండు నెలలుగా ఫిట్‌సెన్ పాటించడం.. ఈ కఠిన సమయంలో నాకు ఎంతో ఉపయోగపడింది. భర్త అక్షయ్, పిల్లలు కలిసి కరోనాతో పొరాడాం''  ప్రతీ ఒక్కరు కూడా వ్యాయామం చేయండి. మన ఇంట్లో చేసే సింపుల్ వాకింగ్ కూడా మన స్టామినా పెంచేందుకు ఎంతో ఉపయోగపడుతుంది అంటూ ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

కాగా సమీరా రెడ్డి, వ్యాపారవేత్త అక్షయ్‌ వార్డేను 2014లో పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత ఆమె సినిమాల్లో కనిపించడమే మానేసింది. తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించింది సమీరా రెడ్డి. రానా దగ్గుబాటి హీరోగా నటించిన 2012లో 'కృష్ణం వందే జగద్గురుమ్‌' సినిమాలోని స్పెషల్‌ సాంగ్‌లో కనిపించింది. ఎన్టీఆర్ నరసింహుడు, ఆశోక్.. చిరంజీవి జైచిరంజీవ చిత్రాల్లో కూడా నటించింది.


Tags:    

Similar News