Tollywood Drugs Case: డ్రగ్స్‌ కేసులో ముగిసిన తరుణ్‌ ఈడీ విచారణ

* దాదాపు ఆరు గంటలపాటు ఇంటరాగేషన్‌ * పలు పత్రాలతో తరుణ్‌ తండ్రి, ఆడిటర్‌ హాజరు

Update: 2021-09-22 15:47 GMT

 డ్రగ్స్‌ కేసులో ముగిసిన తరుణ్‌ ఈడీ విచారణ (ఫోటో-ది హన్స్ ఇండియా )

Tollywood Drugs Case: టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో హీరో తరుణ్‌ ఈడీ విచారణ ముగిసింది. దాదాపు ఆయనను ఆరు గంటలపాటు ఇంటరాగేషన్‌ చేశారు అధికారులు. విచారణకు పలు పత్రాలతో తరుణ్‌ తండ్రి, ఆడిటర్‌ రాగా తరుణ్‌ బ్యాంక్‌ లావాదేవీలపై ఆరా తీసింది ఈడీ. మనీ ల్యాండరింగ్‌, ఫెమా నిబంధనల ఉల్లంఘనతో పాటు ఎఫ్‌ లాంజ్‌ క్లబ్, కెల్విన్‌తో సంబంధాలపై తరుణ్‌ను ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే 2017లో ఎక్సైజ్‌ శాఖ విచారణకు హాజరైన తరుణ్ జులై 19న స్వచ్ఛందంగా ఎక్సైజ్‌ శాఖ కు బయో శాంపిల్స్‌ ఇచ్చారు. డ్రగ్స్‌ ఆనవాళ్లు లేనట్లు ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌ రిపోర్ట్ ఇచ్చింది. కెల్విన్‌ ఇచ్చిన వివరాలపై గతంలో తరుణ్‌ను విచారించిన ఎక్సైజ్‌శాఖ తన వద్ద ఎలాంటి ఆధారాలు లేవని గతంలో తేల్చింది.

Tags:    

Similar News