బీజేపీ నేతలకు కృష్ణంరాజు విందు

Update: 2020-01-26 02:15 GMT

బీజేపీ నేత, సినీ నటుడు  పుట్టిన రోజు సందర్భంగా ఆయన జూబ్లీహిల్స్‌లో బీజేపీ నేతలకు పార్టీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో పాటు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, పలువురు బీజేపీ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కృష్ణంరాజు కేక్ కట్ చేసి బీజేపీ నేతలకు తినిపించారు. గత సోమవారం పుట్టినరోజు వేడుకను జరుపుకున్న కృష్ణంరాజు.. సినీ ప్రముఖులకు కూడా పార్టీ ఇచ్చారు. ఈ పార్టీకి చిరంజీవితో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరైయ్యారు. తాజాగా బీజేపీ నేతలతో కలిసి పుట్టినరోజు వేడుకను కృష్ణంరాజు మరోసారి జరుపుకున్నారు.

Tags:    

Similar News