ఏపీ ప్రభుత్వ విప్లను నియమించారు సీఎం జగన్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్విప్గా రాయచోటి నియోజకవర్గ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి నియామకం అయ్యారు. చీఫ్విప్తో పాటు మరో ఐదుగురు విప్లను నియమించారు. విప్లుగా పార్థసారథి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, బుడి ముత్యాల నాయుడు, దాడిశెట్టి రాజాను ఎంపికయ్యారు. కాగా శ్రీకాంత్ రెడ్డికి కేబినెట్లో స్థానం దక్కుతుందని అందరూ భావించినప్పటికీ సామాజిక వర్గాలకు సముచిత స్థానం కల్పించే ప్రయత్నాల్లో భాగంగా ఆయనకు మంత్రి పదవి దూరమైనట్లు తెలుస్తోంది.