వైసీపీ మేనిఫెస్టోలో రైతులకు వరాల జల్లు

Update: 2019-04-06 06:44 GMT

వైసీపీ మేనిఫెస్టోలో రైతులకు వరాల జల్లు కురిపించారు జగన్. ప్రతి రైతు కుటుంబానికి 50వేలు ఇస్తామని చెప్పారు. వ్యవసాయానికి పగటి పూట 12 గంటలు కరెంట్ ఇస్తామని తెలిపారు. రైతులకు ఉచితంగా బోర్లు వేస్తామని హామీ ఇచ్చారు. కౌలు రైతులకు వడ్డీ లేని రుణాలు అందిస్తామన్నారు.

అన్ని కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు జగన్. కార్పొరేషన్లకు తగిన నిధులు కేటాయించి ఆయా కులాలకు చెందిన పేదలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కుల,మతతత్వాలు లేని సమసమాజ నిర్మాణానికి కావాల్సిన సుపరిపాలన అందిస్తామని జగన్ వెల్లడించారు.  

Similar News