చేసే వాగ్దానాలన్నీ నిజాయితీగానే చేద్దాం: జగన్‌

Update: 2019-03-06 11:24 GMT

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీతో వైసీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం సమావేశం అయ్యారు. కాగా మేనిఫెస్టోలో భాగంగా మాట్లాడుతూ మేనిఫెస్టోలో వాగ్దానాలన్నీ నిజాయితీగానే చేద్దామన్నారు వైసీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి . వాగ్దానాలు చేయడంలో తమకు ఏ పార్టీతోనూ పోటీ అవసరం లేదని జగన్ మోహన్ రెడ్డి కమిటీకి సూచించారు. అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను పరిగణలోకి తీసుకుంటామని, ఇటివల చేపట్టిన పాదయాత్రలో ప్రజలకిచ్చిన హామీలన్నింటినీ తమ మేనిఫెస్టోలో పొందుపరుస్తామని పేర్కొన్నారు. అలాగే కౌలు రైతులకు తప్పకుండా న్యాయం చేస్తామని జగన్‌ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. తమ పార్టీ మేనిఫెస్టో సంక్షిప్తంగా అందరికీ అర్థమయ్యేలా ఉంటుందని వెల్లడించారు.

Similar News