జగన్ సభలో అపశృతి... కరెంట్ షాక్‌తో ఒకరు మృతి

Update: 2019-04-03 10:02 GMT

గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో వైఎస్ జగన్ నిర్వహించిన బహిరంగ సభలో అపశృతి చోటు చేసుకుంది. బహిరంగ సభ ముగిసిన తరువాత విద్యుత్ షాక్ తగిలి ఒకరు చనిపోగా 10 మంది గాయపడ్డారు. మృతి చెందిన వ్యక్తి సోమిరెడ్డి ఆర్టీసీ కండక్టర్ . కరాలపాడుకు చెందిన చల్లా సోమిరెడ్డిగా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని గుంటూరుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పిడుగురాళ్లలోని ఐలాండ్ సెంటర్ లో బహిరంగ సభ నిర్వహించారు జగన్. అయితే ఈ సభకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రసంగం ముగించి వెళ్లగానే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కాగా స్థానికంగా ఉన్న జ్యూస్ షాపు జనరైటర్ వైర్ కట్ చేసి వదిలివెళ్లడంతో ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.  

Similar News