వైసీపీ జనసేనల మధ్య పొత్తుల ప్రకంపనలు...
ఏపీలో పొత్తుల రాజకీయాలు హాట్హాట్గా సాగుతున్నాయి. జనసేనతో పొత్తు కోసం అటు టీడీపీ, ఇటు వైసీపీ ప్రయత్నిస్తున్నాయంటూ వార్తలు వినిపిస్తున్న వేళ జనసేన అధినేత సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో పొత్తుల రాజకీయాలు హాట్హాట్గా సాగుతున్నాయి. జనసేనతో పొత్తు కోసం అటు టీడీపీ, ఇటు వైసీపీ ప్రయత్నిస్తున్నాయంటూ వార్తలు వినిపిస్తున్న వేళ జనసేన అధినేత సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు బలం లేదంటూ బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తున్న వైసీపీ పొత్తు కోసం తనతో చర్చలు జరుపుతోందంటూ వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ నేతలతో మాట్లాడిస్తున్నారంటూ కార్యకర్తల సమావేశంలో వెల్లడించారు. జనసేనకు బలం ఉంది కాబట్టే పొత్తుల కోసం ప్రయత్నిస్తున్నారంటూ కార్యకర్తలకు వివరించారు.
పొత్తుల విషయంలో పవన్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు తీవ్రంగా స్పందించారు. తమది రోజుకో మాట పూటకో బాట పట్టే రకం కాదని ఈ విషయంలో తమ అధినేత జగన్ స్పష్టత ఇచ్చారంటూ చెబుతున్నారు. టీడీపీతో బంధం బలోపేతం చేసుకునేందుకు పవన్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈడ్రామాలో చంద్రబాబు డైరెక్టర్ అయితే పవన్ యాక్టర్ అంటూ ఆరోపిస్తున్నారు.
పవన్ పొత్తు కామెంట్స్పై టీఆర్ఎస్ కూడా స్పందించింది. పార్టీ పరంగా తాము ఎవరితోనూ చర్చలు జరపలేదని ఎమ్మెల్సీ భాను ప్రసాద్ స్పష్టం చేశారు. వ్యక్తులుగా ఎవరైనా చర్చలు జరుపుతున్నారేమో తనకు తెలియదన్నారు. అయితే తీవ్ర స్ధాయిలో విమర్శలు వినిపిస్తున్నా జనసేన మాత్రం వెనక్కు తగ్గడం లేదు. పొత్తులకు సంబంధించిన చర్చల కోసం నేతలు సాగించిన ఆధారాలు తమ దగ్గర ఉన్నాయన్నారు. అవసరం వచ్చినప్పుడు అసలు వాస్తవాలు బయటపెడతామంటూ హెచ్చరిస్తున్నారు.