బాపట్లలో వైసీపీకి షాక్ !

Update: 2019-03-12 11:21 GMT

వైసీపీ పార్టీ అభ్యర్థులను పూర్తిగా ఖరారు చేయలేదు. మరో వారంలోనే నామినేషన్ల పర్వం మొదలు కానున్న నేపథ్యంలో వైసీపీలోపి అసంతృప్తులు భగ్గుమంటున్నారు. ఎక్కడికక్కడ నిరసనలకు దిగుతున్నారు. గుంటురూ జిల్లా బాపట్ల వైసీపీలో ముసలం రాజుకుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే కోన రఘపతికి వ్యతిరేకంగా రెడ్డి సామాజిక వర్గం పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టటం కలకలం రేపింది. జగన్ రావాలి, కోన పోవాలి అని హోరునా నిరసన చేపట్టడంతో నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. అయితే కోన రఘపతి అభ్యర్ధిత్వాన్ని మాజీ శాసనసభ్యుడు గోవర్థన్ ‌రెడ్డి వ్యతిరేకిస్తున్నారు. అయితే గోవర్థన్ ‌రెడ్డి తెర వెనక నుండి ఈ ర్యాలీ ఎవరు చేపట్టించారు అనేది కోన రఘపతి వర్గం ఆరోపిస్తోంది. ఒరుగుంట్ల రెడ్ల సంఘం కోన రఘుపతికి వ్యతిరేకంగా ఏకమైంది. నామినేషన్లకు గడువు కొద్ది రోజులు ఉండడంతో ఇప్పడు వ్యతిరేక పవనలు రావడం వైసీపీని తీవ్ర కలవర పెడుతోంది. చూడాలి ఈ ర్యాలీలు ఎక్కడి వరకు దారితీస్తాయో మరీ.

Similar News