టిడీపీ చలువతోనే ఈ స్థాయికి..:యనమల

Update: 2019-02-28 09:42 GMT

ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ఎమ్మెల్సీ నామినేషన్ల పర్వం నెలకొంది. గురువారం ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్బంగా యనమల రామకృష్ణుడు మాట్లాడతూ ఏడు ఎమ్మెల్సీ స్థానాలు ఉన్నవాటిలో నాలుగు స్థానాలను బీసీలకే కేటాయించడం బట్టే తెలుగుదేశం ప్రాధాన్యత ఎవరికో అర్ధమవుతోందని యనమల చెప్పారు. కాగా రెండోసారి కూడా ఎమ్మెల్సీగా నాకు అవకాశం కల్పించిన తెలుగుదేశం పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడుకి యనమల కృతజ్ఞతలు తెలిపారు. తనను నమ్మి ఈ బాధ్యతను కట్టబెట్టినందుకు సమర్థంగా నిర్వర్తిస్తానని టిడీపీ చలువతోనే తాను ఈస్థాయికి వచ్చానని యనమల అన్నారు. జాతీయస్థాయిలో తెలుగుదేశం పార్టీ కీలక పాత్ర పోషిస్తుందని యనమల అన్నారు. యనమల వెంట మంత్రులు చినరాజప్ప, అచ్చెన్నాయుడు, జవహర్‌ ఉన్నారు. 

Similar News