బ్యాంక్తో పాటు ఈవీఎంలను బాంబులతో పేలుస్తామని ఓ మహిళ పంపిన మెసెజ్ కలకలం సృష్టించింది. విశాఖ జిల్లా అనకాపల్లిలోని ఓ గ్రామీణ బ్యాంకు మేనేజర్కు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేల ఫోన్లకు బెదిరింపు మెసేజ్లు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ మేనేజర్కు అపరిచిత వ్యక్తుల నుండి మెసేజ్లు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన బ్యాంక్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అనకాపల్లి మండలం వెలుగు కమ్యూనిటీలో క్లస్లర్ ఏజెంట్గా పనిచేస్తున్న సీతానగరం గ్రామానికి చెందిన శివరంజని అనే మహిళను నిందితురాలిగా గుర్తించారు. పోలీసులు మహిళను అరెస్ట్ చేశారు. అయితే బ్యాంక్ మేనేజర్తో పాటు మరో 16 మందికి బెదిరిస్తూ మెసేజ్లు పెట్టినట్టు పోలీసులు గుర్తించారు. అయితే ఆ మహిళలకు పసుపు- కుంకుమ కింద ఇవ్వాల్సిన డబ్బునున బ్యాంక్ మేనేజర్ పాత బకాయిల కింద ఉంచుకున్నరని అందుకే ఇలా మెసేజ్లతో బెదిరించాలని శివరంజని విచారణలో వెల్లడించినట్లు డీఎస్పీ ప్రసాద్ తెలిపారు.