ఏపీ అసెంబ్లీలో బీసీ సబ్ప్లాన్పై ఆసక్తికర చర్చ నడిచింది. సబ్ప్లాన్కు ఎంత శాతం నిధులు కేటాయిస్తున్నారో స్పష్టతలేదని ప్రభుత్వ విప్ కూన రవికుమార్ మంత్రి అచ్చెన్నాయుడిని నిలదీశారు. కూనకు సపోర్ట్గా మంత్రి పితాని కూడా బీసీ సబ్ప్లాన్ బిల్లులో స్పష్టత లేదని అన్నారు. కూన రవికుమార్ సంధించిన ప్రశ్నలకు మంత్రి అచ్చెన్నాయుడు నీళ్లు నమిలాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో కాసేపు సభ స్తంభించింది.