మళ్లీ మేమే అధికారంలోకి వస్తాం: అమిత్‌షా

Update: 2019-05-17 11:38 GMT

సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 300 పైగా సీట్లు సాధిస్తుందని బీజేపీ చీఫ్ అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. చివరి దశ ఎన్నికల ప్రచారం ముగియడంతో ప్రధాని మోడీ, బీజేపీ చీఫ్ అమిత్‌ షా ఢిల్లీలో బీజేపీ కార్యకర్తలతో సమావేశం అయ్యారు. ప్రజలు తమవైపే ఉన్నారని మరోసారి మోడీ సర్కార్ ఏర్పడడం ఖాయమని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. 2014లో చారిత్రక తీర్పుతో అధికారంలో వచ్చామని, పూర్తి మెజారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. 2019లోనూ మోడీ ప్రభుత్వం తిరిగి పెద్ద మెజారిటీతో అధికారంలోకి వస్తుందనే నమ్మకం తమకుందని అమిత్‌షా అన్నారు.

Similar News