మాజీ మంత్రి వివేకానందరెడ్డి భౌతికకాయానికి పోస్ట్మార్టం పూర్తయింది. పులివెందులోని ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం చేసిన వైద్యులు అనంతరం మృతదేహన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కుటుంబసభ్యులు భౌతికకాయన్ని స్వగృహానికి తరలించారు. మొదట వివేకానందది సహజ మృతి అని అందరూ భావించారు. అయితే, ఆయన శరీరంపై పలుచోట్ల గాయాలు ఉండటంతో హత్య జరిగిందా అనే అనుమానాలు మొదలయ్యాయి. కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో పోస్ట్మార్టం నివేదిక కీలకం కానుంది.