అందుకే మళ్లీ వైసీపీలోకి వచ్చా: వరుపుల

Update: 2019-03-18 11:57 GMT

ఇటివలే ప్రత్తిపాడు సిట్టింగ్‌ ఎమ్మెల్యే వరుపులు సుబ్బారావు టీడీపీకి గుడ్‌ బై చెప్పి వైసీపీలో చేరిన విషయం తెలిసిందే. కాగా సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ తన తోడల్లుడు జ్యోతుల నెహ్రూకు మంత్రి పదవి ఇస్తానంటేనే తెలుగుదేశం పార్టీలో చేరానని వరుపుల సుబ్బారావు వెల్లడించారు. కాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనకు చేసిన అన్యాయంపై ఆవేదన వ్యక్తం చేశారు. అయితే మనవడే కదా అని వరుపుల రాజాను తన వెంట ఉంచుకొని పూర్తి స్వేచ్ఛను ఇస్తే తాతకే వెన్నుపోటు పొడిచి సీటు లాక్కున్నాడని వరుపుల సుబ్యారావు వాపోయారు. కాగా టీడీపీ తనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానన్న కానీ తిరస్కరించి మళ్లీ వైసీపీలోకి వచ్చినట్టు వెల్లడించారు. 

Similar News