నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం నుండి ఎంపీగా గెలుపొందిన టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించారు. ఈనెల 3వ తేదీన ఆయన తన రాజీనామా లేఖ అందించే అవకాశం ఉంది. గత ఏడాది జరిగిన తెలంగాణా ఎన్నికల్లో భాగంగా అయన హుజుర్నగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు... అయితే ఉత్తమ్ ఈ సారి ఎంపీగా నల్గొండ నుండి పోటి చేసి గెలవడంతో తన ఎమెల్యే పదవికి రాజీనామా చేయాలనీ నిర్ణయం తీసుకున్నారు .. అయన రాజీనామా చేసిన అనంతరం హుజుర్నగర్కు ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది.. అయితే ఈ ఎన్నికల్లో అయన సతిమణి పద్మావతి కాంగ్రెస్ నుండి బరిలోకి దిగుతారు అని టాక్ నడుస్తుంది .. గతంలో ఆమె కోదాడ నుండి పోటిలో నిలిచి ఓడిపోయారు ..