మట్టిపెళ్లలు కూలి విషాదం..

Update: 2019-04-29 07:53 GMT

విశాఖ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పాయకరావుపేట మండలం ఉప్పరగూడెం దగ్గర తాండవ నదిలో అక్రమంగా ఇసుక తవ్వతుండగా మట్టి పెళ్లలు కూలిపడ్డాయి. ప్రమాదంలో ఇద్దరు కూలీలు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు గాయపడ్డారు. గాయపడ్డవారిని తుని ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఇసుక దిబ్బల్లో కూరుకుపోయిన వారిని వెలికి తీశారు. మృతులు అనపర్తి శ్రీను, వీసం సత్తిబాబుగా గుర్తించారు.  

Similar News