బస్సు-కారు ఢీ, ఇద్దరు మృతి

Update: 2019-04-12 05:23 GMT

సంగారెడ్డి జిల్లా ఆందోల్ (మం) అల్మాయిపేట గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. నారాయన్ ఖేడ్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. వీరిని దత్తు (20), కిరణ్‌ (19)గా గుర్తించారు. శుక్రవారం ఉదయం 9.30 ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. అనంతరం క్రేన్ సాయంతో వాహన శకలాలను తొలగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

Similar News